5 అంతస్తుల భవనం పైనుంచి కుక్క మీద పడటంతో చిన్నారి మృతి

-

మహారాష్ట్రలోని ఠాణెలో విషాద ఘటన జరిగింది. బజారు వీధిలో వెళ్తున్న ఓ చిన్నారిపై ఐదు అంతస్తుల భవనంపై నుంచి కుక్క పడింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రోజున మూడేళ్ల బాలిక తన తల్లితో కలిసి ఠాణెలోని బజారు వీధిలో నడిచి వెళ్తోంది. మార్గమధ్యలో పక్కనున్న అయిదు అంతస్తుల భవనం పైనుంచి ఓ శునకం చిన్నారిపై  పడింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా  అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే కుక్కే కిందికి దూకిందా?.. లేదా దాన్ని ఎవరైనా విసిరేశారా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి.. ఇందులో కుక్క యజమాని నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news