సుంకిశాల్ డ్యామ్ కూలడంపై కేంద్రం కీలక ప్రకటన !

-

సుంకిశాల్ డ్యామ్ కూలడంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్రం తరఫున కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. సుంకిశాల్ డామ్ కూలడం పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Center’s key announcement on the collapse of Sunkishal Dam

ఢిల్లీలో తన తల్లి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అనంతరం మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని… పాక్ ఉగ్రవాదులు శాంతియుత పరిస్థితులు చెడగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కు సిద్ధంగా ఉంది… జమ్మూకాశ్మీర్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రె డ్డి. దేశ ప్రజలు అమ్మ పేరుతో చెట్టు నాటాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారని.. అందరూ మొక్కలు నాటాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news