అన్నమయ్య జిల్లాలో పరువు హత్య..కూతురికి ఉరేసిన తల్లిదండ్రులు !

-

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో పరువు హత్య కలకలం రేపుతోంది. ఇష్టం లేని‌ ప్రేమా పెళ్ళి చేసుకుందని కారణంగా తల్లిదండ్రులే చంపి.. కూతురిని ఊరివేసి ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్థులు. పెద్దమండెం మండలం బండ్రేవు అడవిలో ఈ ఘోరం జరిగింది. వరుసకు అన్న అయిన వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోయింది మైనర్ బాలిక. దీంతో గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.

ఇక మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలికను వెతికి, తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. అయితే… ఆ బాలిక మొన్న రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లియి పెద్దమండెం మండలం బండ్రేవు అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందట. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన బాలిక తల్లిదండ్రులు…. ఇది అవమానంగా భావించి బాలిక మృతదేహాన్ని గుర్తు చప్పుడు కాకుండా దగ్ధం చేసి బూడిద చేశారు. ఇక ఆ బాలిక మరణం పై అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.. కూతురిని ఊరివేసి ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్థులు. వీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news