తిరుమల వెళ్లే వారికి తీపికబురు..19వ తేదీ నుంచి దర్శన టికెట్లు..వివరాలు ఇవే

-

తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త…ఈ నెల 19వ తేది నుంచి 27వ తేది వరకు ఆన్ లైన్ లో నవంబర్ నెల దర్శన టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టిటిడి. 19వ తేది నుంచి 21వ తేది వరకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ నెల 22వ తేది ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల కానున్నాయి.

ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కేట్లు విడుదల కానున్నాయి. ఇక ఈ నెల 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టిక్కేట్లు విడుదల కానున్నాయి. 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కేట్లు విడుదల కానున్నాయి. మధ్చాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కేట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 24వ తేది ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల కానుంది. ఈ నెల 27వ తేది శ్రీవారి సేవా స్లాట్లు విడుదల అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news