అమానుషం.. భార్యను బైక్ కు కట్టేసి ఊరంతా ఈడ్చుకెళ్లాడు

-

రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను బైక్కు కట్టేసి ఊరంతా ఈడ్చుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌ కావడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగౌర్‌కు చెందిన ప్రేమ్‌రామ్‌ మేఘ్‌వాల్‌ (32) భార్య జైసల్మేర్‌లో ఉన్న తన అన్న ఇంటికి వెళ్లాలనుకుంది. అయితే భర్త వెళ్లొద్దని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఫూటుగా తాగి ఉన్న ప్రేమ్ రామ్.. మద్యం మత్తులో భార్యపై దాడి చేసి ఆమె కాళ్లను బైక్ వెనుక తాడుతో కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లాడు. నెల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా తమ దృష్టికి రావడంతో నిందితుడిని అరెస్టు చేసిన పాంచౌడీ ఏఎస్‌ఐ సురేంద్రకుమార్‌ తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం తన బంధువుల ఇంట్లో ఉంటోందని వెల్లడించారు. అయితే ఈ ఘటనపై ఆమె ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news