బాలాపూర్ గ్యాంగ్ స్టర్ హత్య కేసును చేధించిన పోలీసులు..!

-

బాలాపూర్ లో జరిగిన గ్యాంగ్ స్టర్ రియాజ్ హత్య కేసును చేధించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ చేశాం. ప్రధాన నిందితుడు హమీద్ పరారీలో ఉన్నాడు. 13 లక్షలకు సుపారీ హత్య చేసినట్లు గుర్తించాము నిందితుల నుంచి కంట్రీ మేడ్ గన్, రెండు బుల్లెట్స్, రెండు గొడ్డళ్లు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నాం. మీర్పేట్ లో వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్ లో ల్యాండ్ డిస్ప్యూట్ తో మొదట గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రధాన నిందితుడు, మృతుని మధ్య గొడవలు పెరిగిపోయాయి.

మృతుడు రియాజ్ రౌడీ షీటర్. మేర్పేట్ లో ల్యాండ్ వివాదం పై ఒకరిపై ఒకరు కేసులు పెట్టారు. ప్రధాన నిందితుడు హమీద్.. గోల్కొండ ప్రార్ధన చెందిన సలీం కి 13 లక్షల సూపారీ ఇస్తానని చెప్పాడు. అడ్వాన్స్ గా 2 లక్షల 50 వెలు ఇచ్చాడు. మర్డర్ ప్లాన్ చేసి… హమీద్ దుబాయ్ కి వెళ్ళిపోయాడు. హమీద్, సలీం యూపీ కి వెళ్లి కంట్రీ మేడ్ గన్ కొనుక్కొని వచ్చారు. మొయినాబాద్ దగ్గర గొడ్డళ్లు, కత్తులు కొన్నారు. రియాజ్ ను చంపడానికి ముందే రెక్కీ చేశారు. కంచన్ బాగ్ లోని ఓ వైన్స్ లో రియాజ్ తాగి బైక్ పై వస్తుండగా… కార్ తో డీకొట్టారు . అతను కింద పడగానే కళ్ళల్లో కారం చల్లారు. కత్తి, గొడ్డళ్ళ తో దాడి చేశారు. ఆ తర్వాత సలీం గన్ తో షూట్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత విజయవాడ కి వెళ్ళారు… అక్కడ కార్ వదిలేసి వైజాగ్ కి బస్ లో వెళ్ళారు. అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళారు. అక్కడే నిందితులను అరెస్ట్ చేశాం అని రాచకొండ సీపీ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news