పవన్‌ కల్యాణ్‌తో ఆద్య ఫొటో వైరల్.. రేణూ దేశాయ్‌ ఏమన్నారంటే?

-

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఎగురవేశారు. అయితే ఈ కార్యక్రమానికి పవన్‌తోపాటు ఆయన కుమార్తె ఆద్య కూడా వెళ్లింది. ఆ సమయంలో పవన్ తో కలిసి ఆద్య ఓ సెల్ఫీ తీసుకుంది. ప్రస్తుతం ఈ తండ్రీ కూతుళ్ల సెల్ఫీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సో క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సెల్ఫీని పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు.

‘నా కూతురు ఆద్య నాన్నతో పాటు స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లనా అని అడిగింది. తండ్రితో టైం స్పెండ్ చేయాలనుకోవడం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో చూడాలని తను అనుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఏపీ ప్రజల కోసం తన తండ్రి చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది. ఆయణ్ను ప్రశంసించింది.’ అని రేణూ దేశాయ్ తన పోస్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news