కార్తికేయ 2కు జాతీయ అవార్డు.. పార్ట్-3 పై డైరెక్టర్ అనౌన్స్ మెంట్

-

70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించిన విషం తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగులో కార్తికేయ-2 సినిమా ఈ జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఉత్సాహంలోనే ఆ సినిమా డైరెక్టర్ చందూ మొండేటి కార్తికేయ-3 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేశారు.

 

భాషతో సంబంధం లేకుండా కార్తికేయ-2 సినిమాను అన్ని భాషల ప్రజలు ఆదరించారని చందూ మొండేటి అన్నారు. తమ సినిమాకు జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్తికేయ-2కు కొనసాగింపుగా కార్తికేయ-3 త్వరలోనే రాబోతోందని వెల్లడించింది. అయితే ఆ సినిమాలోనూ అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప కాన్సెప్ట్ ఉంటుందని చెప్పారు. మొదటి రెండు పార్టుల్లో కంటే మూడో పార్ట్ మరింత థ్రిల్ పంచుతుందని తెలిపారు. ఈ సినిమా కోసం చాలా పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సినిమా పనులు మొదలయ్యాయని.. అధికారికంగా త్వరలోనే కార్తికేయ-3 సినిమా ప్రకటన ఉంటుందని చందూ మొండేటి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news