బిగ్ షాక్‌: నెల‌కు 300 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే కుటుంబాల‌కు ఆ ప‌థ‌కం క‌ట్‌..

-

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఈ పథకాన్ని ఈ నెల 9న చిత్తూరులో సీఎం జగన్ ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ ప‌థకం ద్వారా పిల్లలను చదివించే తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 43 లక్షల మంది తల్లుల ఖాతాలో రూ.6,400 కోట్లు జమచేస్తామని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.

కానీ.. నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే కుటుంబాలకు అమ్మఒడి వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఆరు నెలల విద్యుత్ బిల్లుల సరాసరి పరిశీలించి అర్హులను గుర్తిస్తామని తెలిపారు. ఈసారి 75 శాతం హాజరు నిబంధన పరిగణించకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news