ఖైరతాబాద్ గణేష్ వద్ద అపచారం…రేవంత్ రెడ్డి ఉండగానే!

-

Khairatabad Ganesh:  ఖైరతాబాద్ గణేష్ వద్ద అపచారం జరిగింది. ఖైరతాబాద్ గణేష్ వద్ద గజ మాల తెగిపడింది. రేవంత్ రెడ్డి ఉండగానే ఖైరతాబాద్ గణేష్ వద్ద గజ మాల తెగిపడింది. దీంతో అక్కడ ఉన్న వారు షాక్‌ అయ్యారు. అనంతరం ఖైరతాబాద్ గణేష్ వద్ద గజ మాలను మళ్లీ కట్టారు. కాగా అంతకు ఖైరతాబాద్‌ గణేశుడికి సీఎం రేవంత్‌ తొలిపూజ నిర్వహించడం జరిగింది.

Gaja Mala cut at Khairatabad Ganesh

ఖైరతాబాద్ గణేశుడిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్న తర్వాత…తొలిపూజ నిర్వహించడం జరిగింది. సప్తముఖ వినాయకుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి స్థానిక ఖైరతాబాద్‌ నియోజక వర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి.. మహాగణపతికి గజమాల, పండ్లు సమర్పించారు. వినాయకుని తొలిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, రోహిన్‌రెడ్డి, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://x.com/TeluguScribe/status/1832303854869774578

Read more RELATED
Recommended to you

Latest news