ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

-

ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బుధవారం నాడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 17న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. వచ్చే నెల 15లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 3వ తేదీ నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు దశల్లో మండల పరిషత్ ఎన్నికలు, మూడు దశల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సమర్పించిన అఫిడవిట్‌కు ఏపీ రాష్ట్ర హైకోర్టు ఓకే చెప్పింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లను అమలు విషయమై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news