భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలి : మోషేన్‌ రాజు

-

తిరుపతి లడ్డు వివాదం పై ఏపీ శాసనమండలి ఛైర్మన్ కొయ్య మోషేన్ రాజు స్పందించారు. తిరుపతి లడ్డు కల్తీ పై నేను కూడా సిబిఐ విచారణ కు డిమాండ్ చేస్తున్నా అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డు కల్తీ జరిగిందని చెప్పారు. కాబట్టి తిరుపతి లడ్డు వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలి అన్నారు. నిజంగా కల్తీ జరిగిందని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలి అని కోరారు.

కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ విషయంలో ప్రతిపక్షాలు సహితం హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలు వాస్తవాలు బయటకు రావాలి. దేవుడి దగ్గర జరిగిన నిజాలు ప్రజలకు తెలియాలి. స్పీకర్ల కాన్ఫరెన్స్ లో నా పక్కన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి కూర్చున్నారు. మా మధ్యలో లడ్డు వివాదం పై చర్చ జరిగింది అని మోషేన్‌రాజు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news