అకస్మాత్తుగా భర్త మృతి.. అంత్యక్రియల కోసం భార్య వేడుకోలు!

-

హుజురాబాద్ రూరల్ మండలంలోని ధర్మరాజు పల్లిలో దారుణం చోటుచేసుకుంది. భర్త అంత్యక్రియల కోసం సాయం చేయాలని భార్య వేడుకుంటోంది.ఈ ఘటన గ్రామంలో అందరినీ కలిచివేస్తున్నది. ఇంటి పెద్ద దిక్కు భర్త మెదడులో రక్తం గడ్డ కట్టి అకస్మాత్తుగా మరణించాడు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు భార్య వద్ద డబ్బులు లేవు. దీంతో దాతల సాయం కోసం ఎరుచూస్తోంది.

వివరాల్లోకి వెళితే..ధర్మరాజు పల్లి గ్రామానికి చెందిన కోట లక్ష్మణ్, ప్రేమలత దంపతులు. ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.కూలి పని చేసే వీరికి ఇద్దరు కూతుళ్లు. వారికి వివాహం జరిపించారు.అయితే, ఉన్నట్టుండి లక్ష్మణ్ కింద పడిపోవడంతో స్థానికుల సాయంతో భార్య ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లింది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంటిముందు పెట్టొద్దని అద్దె ఇంటి యజమాని చెప్పడంతో ఊరి బయటనే మృతదేహాన్ని చిన్న డేరా వేసి ఉంచారు. అయితే, భర్త అంత్యక్రియలకు తన వద్ద డబ్బులు లేవని సాయం చేయాలని భార్య వేడుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news