తిరుమలలో ఎప్పుడైనా చంద్రబాబు గుండు కొట్టించుకున్నాడా ? – కొడాలి నాని

-

 

చంద్రబాబు ఎప్పుడైనా తిరుపతిలో గుండు కొట్టించుకున్నాడా ? అంటూ నిలదీశారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని. అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం అన్నం తినేవాడు ఎవడైనా బజారుకి లాగుతాడా అని ప్రశ్నించారు.

Former Minister Kodali Nani makes personal comments against Chandrababu

తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి లాగాడు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబును ఆ దేవుడు క్షమించడు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని తెలిపారు. సీఎం గా చంద్రబాబు ఉన్న సమయంలో తాజాగా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయన్నారు . ఈ నెయ్యిని కూడా వాడలేదు. గతంలో కొన్ని వందలసార్లు ఇలానే నెయ్యిని వెనక్కి పంపటం జరిగిందని వివరించారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news