ఈతచెట్టుపై నుంచి జారిపడి గీతకార్మికుడికి గాయాలు!

-

కల్లు గీసేందుకు ఈత చెట్టు ఎక్కిన కార్మికుడు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు అమర గాని చంద్రయ్య గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ఈ ఘటన చోటుచేసుకోగా, ఈత చెట్టు పైనుండి పడిన కార్మికుడి వెన్నుపూసకు తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలియడంతో బంధువులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వెన్నుపూస ఎముకలు విరిగాయని ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాల పాలైన గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని, మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జూలపల్లి అధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై రాష్ట్ర స్థాయి గౌడ సంఘం నేతలు సైతం స్పందించి ముందుకు రావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news