సత్యం సుందరం మూవీ పై సాయిదుర్గా తేజ్ పోస్ట్.. స్పందించిన కార్తీ..!

-

అరవిందస్వామి, కార్తి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మెయ్యజగన్. తెలుగులో ఇది ‘సత్యం సుందరం’ పేరుతో విడుదలవుతోంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా పై సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించాలని కోరారు తేజ్. సత్యం సుందరం చాలా అధ్బుతమైన చిత్రం. త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.

మనస్సును హత్తుకునే చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు ప్రేమ్ కుమార్, కార్తి అన్న కాంబినేషన్ లో ఈ సినిమా రూపుదిద్దుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అరవింద స్వామి, కార్తి, సూర్య, జ్యోతికతో పాటు చిత్ర బృందం మొత్తం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. దీనిపై కార్తి స్పందించారు. బ్రదర్.. ప్రేమ, ఆప్యాయతతో మీరు ఎల్లప్పుడూ మంచి మనస్సు చాటుకుంటారు. మీ విషెష్ కి థ్యాంక్ యూ అంటూ రిప్లై ఇచ్చారు కార్తీ. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news