గెటప్‌ వేసే రోజాపై టీటీడీ కేసు పెట్టాల్సిందే – కిరణ్ రాయల్

-

గెటప్‌ వేసే రోజాపై టీటీడీ కేసు పెట్టాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్. లడ్డును చూసి భక్తులు భయపడింది జగన్ ప్రభుత్వంలోనే‌‌‌… అది రోజా‌‌ తెలుసుకోవాలన్నారు. రోజా కన్న గెటప్ కు, సెటప్ లు ఎవరు చేస్తారా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డు వద్దని ఎవరు చెప్పారని నిలదీశారు. లడ్డు పై అవమానకరంగా మాట్లాడినా రోజా పై టిటిడి కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. జగన్ కు అసలు నోటీసులు ఇవ్వలేదన్నారు.

Tirupati Janasena in-charge Kiran Royal made sensational comments against Roja

జగన్ కు నోటీసు ఇచ్చామని అబద్ధం చెప్పి తిరుమల కు రాకుండా తప్పించుకున్నారు..మతాల మధ్య జగన్ చిచ్చు పెట్టి తిరుపతిలో గోడవలు సృష్టించాలని చూశారని వివరించారు తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్. డిక్లరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే జగన్ రాలేదు‌‌…. వైసిపి ప్లాన్ వర్క్ అవుట్ కాకపోవడంతో జగన్ రాలేదన్నారు.డిక్లరేషన్ సంతకం పెట్టకపొతే ఈవో గుడిలోకి రానివ్వరు‌.. పెడితే ఇంట్లో ఆయన సతీమణి రానీయ్యారని… వెంకటేశ్వర స్వామీ జగన్ ను రాకుండా అపారని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news