బుల్డోజర్ వస్తే..అడ్డుగా నా కొడుకు నిలబడతాడు – సబితా ఇంద్రారెడ్డి

-

బుల్డోజర్ వస్తే..అడ్డుగా నా కొడుకు నిలబడతాడని పేర్కొన్నారు బీఆర్ఎస్‌ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మూసీ, హైడ్రా బాధితుల సమావేశంలో బీఆర్ఎస్‌ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… అర్థరాత్రి ఫోన్ చేసినా మీకు మేము వుంటామన్నారు. బుల్డోజర్ వచ్చింది అంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేము వుంటామని భరోసా కల్పించారు సబితా ఇంద్రారెడ్డి.

Former Minister of BRS Sabitha Indra Reddy warns revanth

ఇక అటు హరీష్‌రావు మాట్లాడారు. బుచ్చమ్మ ఆత్మహత్య.. ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య అంటూ హరీష్‌ రావు సీరియస్‌ అయ్యారు. బుచ్చమ్మ పాపం ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి.. పెళ్లిళ్లు చేసింది, ఆ ఇల్లు కూల కొడితే నా బిడ్డల భవిష్యతు ఏం అవుతుందని బాధతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఉదయం 9 గంటలకు హైడ్రా బాధితుల ఇంటికి పోతామని….మూసీ కూల్చివేతలపై హరీష్‌ రావు సంచలన ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news