సిద్దిపేటలో దారుణం..తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు!

-

సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో సోమవారం రాత్రి తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టినట్లు సమాచారం. మంటల్లో విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ ఘటనపై జిల్లాలోని అన్ని పార్టీల నేతలు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అయితే, గ్రామంలోని బురుజు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇంకా ఆవిష్కరించలేదు. దీంతో విగ్రహంపై ముసుగు కప్పి ఉంచారు.ఇంతలోనే గుర్తు తెలియని దుండగులు విగ్రహంపై కప్పి ఉంచిన ముసుగుకు నిప్పు పెట్టారు.విషయం తెలియడంతో బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి చేరుకుని నీళ్లతో శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు.అనంతరం విగ్రహంపై మళ్లీ ముసుగు కప్పారు.ఈ ఘటనపై స్థానిక పోలీస్‌‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనలో హస్తమున్న నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news