మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంతో పాటు రూ.25,000 !

-

మూసీ నిర్వాసితుల విషయం లో సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంతో పాటు రూ.25,000 చెల్లింపు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట సీఎం రేవంత్‌ రెడ్డి. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. ఇవాళ ఏ క్షణమైనా.. దీనిపై ప్రకటన రానున్నట్లు సమాచారం.

The government will pay Rs.25,000 along with a double bedroom to the residents of Musi

మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంతో పాటు రూ.25,000 చెల్లింపు చేస్తే.. వారు శాంతిస్తారని రేవంత్‌ రెడ్డి సర్కార్‌ భావిస్తోందట. కానీ.. మూసీ నిర్వాసితులు… ఒక్కొక్కరికి రూ.50 లక్షలు అడుగుతున్నారు. కాగా మధ్యాహ్నం 3గంటలకు మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితులవుతున్న కుటుంబాలను పరామర్శించనున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంబర్‌పేట్ అసెంబ్లీ ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ నుంచి తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీల్లో నిర్వాసితులను వారి కుటుంబాలను కలుస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news