భారత మూలాలున్న సింగపూర్ మాజీ మంత్రికి ఏడాది జైలు..

-

భాతర మూలాలున్న సింగపూర్ మాీజ మంత్రి ఎస్ ఈశ్వరన్‌కు ఆ దేశ న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 2006లో ఆయన రవాణాశాఖ మంత్రిగా ఉన్న టైంలో 3 లక్షల డాలర్ల విలువైన బహుమతులను లంచంగా అందుకున్నారని రుజువు కావడంతో జడ్జి శిక్షను ఖరారు చేశారు. ఈశ్వరన్ 13 ఏళ్ల పాటు సింగపూర్ మంత్రిగా పనిచేశారు. ఆ దేశంలో అవినీతిని అస్సలు సహించరు.ఈ నేపథ్యంలోనే అతనికి శిక్ష పడటం దేశంలో సంచలనంగా మారింది.

అయితే, ఎస్ ఈశ్వరన్ రవాణాశాఖ మంత్రిగా ఉన్న టైంలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ సాకర్ మ్యాచులు, సింగపూర్ ఫార్ములా 1 గ్రాండ్ పిక్స్‌కు టికెట్స్‌లతో సహా పలు కిక్ బ్యాక్ నేరాలకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే, మంత్రిగా పనిచేసిన వ్యక్తికి జైలు శిక్ష పడటం, కోర్టుకు హాజరవ్వడం ఇదే తొలిసారి అని సింగపూర్ మీడియా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news