యూపీలో అదుపుతప్పిన లారీ..10 మంది వ్యవసాయ కూలీల దుర్మరణం

-

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏకంగా 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన యూపీలోని మీర్జాపూర్‌లోని కట్కా సరిహద్దులో శుక్రవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..వ్యవసాయ కూలీలు అందరూ కలిసి పని నిమిత్తం ట్రాక్టర్‌లో వారణాసికి బయలు దేరారు. ఈ క్రమంలోనే ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి కూలీలు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అదేవిధంగా పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news