విజయవాడలో కారు బీభత్సం.. ఐదుగురు యువకులు?

-

రోడ్డు పక్కన ఉన్న షాపులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లిమిట్స్‌లోని కానూరులో వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కారులో ఐదుగురు యువకులుండగా వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు నడిపిన టైంలో యువకులు మద్యం సేవించి ఉన్నారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దీంతో స్థానికులు, షాపులోని వారు ఊపిరిపీల్చుకున్నారు. కారు అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిగనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news