ఢిల్లీలో హై అలర్ట్..ఉగ్రవాదుల భారీ కుట్ర !

-

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది నిఘా విభాగం. ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది నిఘా విభాగం. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రదాడికి కుట్రలు తెరలేపుతున్నారట. విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించుకునేలా ఉగ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారట.

Delhi police was alerted by the intelligence department

కొన్ని దేశాల ఎంబసీలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నట్టు సమాచారం అందుతోంది. అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద పెట్రోలింగ్, తనిఖీలను పెంచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టే ప్రయత్నాల్లో ఉగ్రవాద ముఠాలు ఉన్నాయని సమాచారం. ఈ తరుణంలోనే.. ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది నిఘా విభాగం.

Read more RELATED
Recommended to you

Latest news