లక్షల్లో లంచాలు తీసుకుంటున్న భార్య.. భర్త ఏం చేశాడంటే..?

-

సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు అయితే లంచం తీసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. లంచం తీసుకోవడంతో పాటు ఆస్తులను కూడబెట్టుకుంటుంటారు. ఇలా చాలా సందర్భాల్లో అవినీతికీ పాల్పడిన వారిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంఘటనలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని లంచం తీసుకుంటే.. బాధితుడెవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ఏ అధికారి కూడా ఆమెను పట్టుకోలేదు.

కానీ ఆమె లంచగొండి అని దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. అది ఎలాగంటే.. ఆమె భర్తనే ఆమె తీసుకొచ్చిన డబ్బును వీడియోలు తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇంట్లో దాచి పెట్టిన డబ్బు కట్టలు అన్ని లంచాలుగా తీసుకున్నదే అంటూ వీడియోలో వెల్లడించారు. దాదాపు రూ.80లక్షలు ఉన్నట్టు తెలిపాడు. తన భార్య లంచం తీసుకోకుండా అసలు ఇంటికి వచ్చేదే కాదంటూ ఆరోపణలు చేశాడు భర్త. లంచాలు తీసుకోవద్దని ఎంత చెప్పినా వినేది కాదని చెప్పాడు. ఈ ఘటన మణికొండలో చోటు చేసుకుంది. మణికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తోంది దివ్యజ్యోతి.  భర్త డబ్బును వీడియో తీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news