నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం !

-

Goddess statue destroyed in Nampally exhibition grounds: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం అయింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మ‌వారి విగ్ర‌హం ఏర్పాటు చేశారు. అయితే… నిన్న రాత్రి దండియా కార్య‌క్ర‌మం పూర్తయ్యే వరకూ ఎక్సిబిషన్ గ్రౌండ్స్‌లోనే ఉన్నారు పోలీసులు.

Goddess statue destroyed in Nampally exhibition grounds

కానీ… అర్థ‌రాత్రి ఎవ‌రూ లేని స‌మ‌యంలో విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు. కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, అమ్మ‌వారి విగ్రహం చేతిని విరగకొట్టారు దుండ‌గులు. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు.. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌ అబిడ్స్ ఏసీపీ చంద్ర‌శేఖ‌ర్‌.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news