దసరా పండుగ వేళ.. VHP సంచలన ప్రకటన

-

దసరా  పండుగ వేళ విశ్వహిందూ పరిషత్  పరిషత్ నాయకులు సంచలన ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానం వేదికగా నేడు శనివారం జరుగబోయే భారత్, బంగ్లాదేశ్. టీ20 మ్యాచ్ ని అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. మ్యాచ్ లో ఎవరు గెలిచినా.. ఓడినా బాధితులు మాత్రం బంగ్లాదేశ్ లోని హిందువులే అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లోని హిందువులను ప్రమాదంలోకి నెట్టొద్దని అన్నారు. తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

దీంతో పోలీసులు నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. టీ20 మ్యాచ్ నిమిత్తం ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సిరీస్లో టీమిండియా ఇప్పటికే తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో గెలిచి క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా ప్రయత్నిస్తుంది. మరోవైపు ఈ మ్యాచు లోనైనా కట్టడి చేయాలని బంగ్లా జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో వీహెచ్ పీ హెచ్చరికలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news