కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ దసరా సంబరాలు

-

కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ దసరా సంబరాలు చేసుకున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ జరుపుకున్నారు.

గ్రామస్తులంతా ఊరేగింపుగా జమ్మి చెట్టువద్దకు రాగా ముఖ్యమంత్రి గారు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జమ్మి పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు వారు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక అటు దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి గారు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news