ఇంట్లో రోజూ ఈ ధూపం వేయండి.. సిరి సంపదులు పెరుగుతాయి..!

-

కర్పూరం గురించి మనం కొత్తగా చెప్పుకోక్కర్లేదు. కర్పూరాన్ని సహజంగా మనం పూజల్లో వాడుతూ ఉంటాము. కర్పూరం లో కూడా రకాలు ఉన్నాయి. పచ్చ కర్పూరం ఒకటి. ఇంకొకటి తెల్ల కర్పూరం. పచ్చ కర్పూరం ప్రసాదాలు వంటి వాటిలో వేసుకుంటూ ఉంటాము. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కర్పూరం బాగా ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడే వాళ్ళు పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన పచ్చ కర్పూరంతో మీరు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ముందు ఒక గిన్నెను పెట్టుకోవాలి.

 

అందులో నీరు పోసి పచ్చ కర్పూరం, పసుపు వేసి తర్వాత దీపారాధన చేయాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండండి. దీనివలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. ఇంట్లో మంచి సువాసన కూడా వస్తుంది.

పసుపు లేదా పచ్చ కర్పూరం ఉన్న వస్త్రాన్ని తీసుకుని కొద్దిగా పచ్చ కర్పూరాన్ని ఉంచి మూటకట్టి ఇంటికి కుబేర స్థానంలో ఉంచాలి. తర్వాత దీపారాధన చేసి ధూపం వేయాలి. ఇలా రోజూ ధూపం వేస్తూ ఉంటే త్వరగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పచ్చ కర్పూరాన్ని పూజ గది లేదా ఇంటికి ప్రధాన ద్వారం వద్ద కట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది, పచ్చ కర్పూరం ముక్కని పేపర్లో కట్టేసి ఉంచినట్లయితే అప్పుల సమస్య నుంచి బయటపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news