బ్రిటిష్ వాసన లేని న్యాయదేవత విగ్రహం ఆవిష్కరణ : సీజేఐ చంద్రచూడ్

-

ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 77ఏళ్లు గడుస్తున్నా మొన్నటివరకు బ్రిటీష్ న్యాయదేవత (లేడీ అఫ్ జస్టిస్) విగ్రహాన్నే దేశంలోని కోర్టుల్లో ప్రతిష్టించడం చూశాం.తాజాగా దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ స్వస్తి పలికారు. న్యాయస్థానం అనుమతితో బ్రిటిష్ న్యాయదేవత విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో అచ్చమైన భారతీయ వేషధారణలో ఉన్న స్త్రీమూర్తి విగ్రహాన్ని న్యాయదేవతగా ఆవిష్కరించారు.

మొన్నటివరకు బ్రిటీష్ న్యాయదేవత ఓ పలుచటి గౌను ధరించి, కుడిచేతిలో కొలతల త్రాచు, ఎడమ చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని ఉండేది. విగ్రహం కళ్లకు గంతలు కట్టి ఉండేవి.అంటే చట్టానికి కళ్లులేవని, చట్టం ముందు అందరూ సమానులే అని, బోనులో నిలబడిన వారి తప్పొప్పుల ఆధారంగా వారికి శిక్ష విధించడం జరుగుతుందనే ఉద్దేశాన్ని ప్రతిబింబించేది. తాజా న్యాయదేవత విగ్రహం పూర్తిగా తెలుపు రంగులో ఉంటుంది. సంప్రదాయ చీరకట్టుతో తలపై కిరీటం,మెడలో ఆభయరణాలు ధరించి పూర్తి భారతీయ కల్చర్ ఉట్టిపడేలా ఉంటుంది. ఈ విగ్రహానికి కూడా కుడి చేతిలో కొలతల త్రాచును పట్టుకుని ఉండగా..ఎడమ చేతిలో రాజ్యాంగం పట్టుకున్నట్లు ఉంటుంది. అనగా బోనులో నిలబడిన వారిని చూసి, పరికించి, వారి తప్పొప్పులను బేరీజు వేశాకే రాజ్యాంగ బద్ధంగా శిక్ష శిధించబడుతుందనే అర్థాన్ని కొత్త న్యాయదేవత విగ్రహం ప్రతిబింబిస్తోంది.త

Read more RELATED
Recommended to you

Latest news