రూ.4 నుంచి 6 పెరగనున్న సీఎన్‌జీ గ్యాస్ ధరలు

-

దేశంలో కంప్రెస్‌డ్ నేచురల్ గ్యాస్(సీఎన్‌జీ) ధరలు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సిటీ గ్యాస్ పంపిణీదారులకు గ్యాస్ కేటాయింపును 20 శాతం మేర తగ్గించడంతో ధరలు పెరిగే అవకాశం ఉందని కంపెనీలు వెల్లడించాయి. సిటీ గ్యాస్ పంపిణీదారులకు ప్రైస్-కంట్రోల్‌డ్ గ్యాస్‌(ఏపీఎం)ను ప్రభుత్వం కేటాయిస్తుంది. దీనిని నియంత్రించడంతో ఇళ్లకు సరఫరా అయ్యే గ్యాస్‌పై ప్రభావం లేకపోయినా, సీఎన్‌జీ ధరలు పెరిగేందుకు ఆస్కారం ఉందని సిటీ గ్యాస్ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు.

దేశంలోని అతిపెద్ద సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ అక్టోబర్ 16 నుంచి 21 శాతం తక్కువ ఏపీఎం గ్యాస్‌ను అందుకుంది. ఇది కంపెనీ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇతర సిటీ గ్యాస్ ఆపరేటర్లకు కూడా ఏపీఎం గ్యాస్ తగ్గింది.పెట్రోకెమికల్ ఉత్పత్తి కోసం గ్యాస్ క్షేత్రాల నుంచి ఏపీఎం గ్యాస్ ఉపయోగించడానికి ప్రభుత్వం ఓఎన్‌జీసీకి అనుమతించినందున సిటీ గ్యాస్ ఆపరేటర్లకు కోత విధించింది. ప్రస్తుతం మార్కెట్లో సరఫరా కొరత లేకపోయినా, కోతలను క్రమంగా కేటాయించాలని, తగిన టైం లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు తెలిపారు.ఫలితంగా సీఎన్‌జీ గ్యాస్ యూనిట్‌కు రూ.4 నుంచి 6 వరకు పెరిగే చాన్స్ ఉందని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news