గాజా పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడి..!

-

పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గాజా పై ఇజ్రాయెల్ భీకర దాడికి పాల్పడింది. ఈ దాడిలో దాదాపు 33 మందికి పైగా పాలస్తీయన్ లు దుర్మరణం పాలయ్యారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో 21 మంది వరకు మహిళలే ఉండటం గమనార్హం. పరిస్థితిని చూస్తే.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక నార్త్ గాజా లోని జబాలియా శరణార్థి శిబిరం పై ఈ దాడి జరిగిందని గాజా లోని అధికారులు వెల్లడించారు. తాజాగా జరిగిన దాడిలో మరణించిన 33 మందితో కలిపి ఇజ్రాయెల్ దాడులలో ఇప్పటివరకు మొత్తం 42,500 మందికి పైగా పాలస్తీనియన్ లు ప్రాణాలను కోల్పోయారు. మరో లక్ష మందికి పైగా గాయపడ్డారు. గాజాలోని హమాస్ మిలిటెంట్ లే లక్ష్యంగా గత కొద్ది నెలల నుంచి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news