నిలిచిన వర్షం.. కొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం

-

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. ఐదు రోజు ఉదయం మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియంలో కారు మబ్బులు కమ్ముకుని చిన్న చిన్న చిరుజల్లులు కురిసాయి. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. తాజాగా వర్షం నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో ఆగిపోయిన మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది.

ప్రస్తుతం చిన్న స్వామి స్టేడియం వద్ద వాతావరణం పొడిగా మారింది.దీంతో 10.15 గంటలకు చివరి రోజు మ్యాచ్ జరగనుంది. తొలి సెషన్ 10.15 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరగనుంది. ఆ తర్వాత 12.30 నుంచి 1.10 వరకు లంచ్ బ్రేక్ ఉండనుండగా.. తిరిగి 1.10కి రెండో సెషన్, మధ్యాహ్నం 3.30కు మూడో సెషన్ జరగనుంది. మొత్తం 91 ఓవర్లలలో టీమిండియా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని కివీస్ చేధిస్తే ఆ జట్టు విజయం సాధించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news