BREAKING: విజయవాడలో దారుణం..భార్యను నరికి చంపిన భర్త

-

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కంసాలి పేట లో అడిగిన డబ్బులు ఇవ్వలేదు అని భార్య ను అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ భర్త. భార్య షేక్ నాగిన(32) సమోసాల దుకాణంలో పనిచేస్తుంది. భర్త షేక్ బాజీ (35) ఎ పని చేయడు తాగుబోతు అని స్థానికులు చెబుతున్నారు. నాగిన, బాజీ లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

A husband who hacked his abusive wife to death in Vijayawada

షేక్ నాగిన కొంత డబ్బులను చుట్టుపక్కల వాళ్ళకి వడ్డీ లకు ఇస్తుందట. అయితే… ఈ రోజు ఉదయం 11 గంటలకు భార్య ను డబ్బులు డిమాండ్ చేశాడు భర్త. ఇక కాసేపు ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత అడిగిన డబ్బు ఇవ్వలేదని భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడు భర్త. రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు టూ టౌన్ పోలీసులు. అనంతరం భర్తపై కేసు నమోదు చేసినా టూ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news