వాహనదారులకు, టెకీలకు అలర్ట్.. వారం రోజులు ఆ ఫ్లైఓవర్ మూసివేత!

-

గ్రేటర్ పరిధిలో కొత్తగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ విభాగం పేర్కొన్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎస్‌ఆర్‌డీపీ అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2లో నూతనంగా ఫ్లై ‌ఓవర్‌‌‌ను నిర్మిస్తున్నారు.దీంతో ఆ పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజులు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

28వ తేదీ (మంగళవారం ) రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవిస్ తెలిపారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్నామ్నాయం చూసుకోవాలని సూచించారు. కాగా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శిల్పా లేఅవుట్‌లోని ఫేజ్-2 ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news