తెలంగాణ పైసలు వయానాడ్ లో ప్రియాంక గాంధీకి ఇస్తున్నారు : కౌశిక్ రెడ్డి

-

తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని అనుకుంటోంది. సీఎం, మంత్రులు టూర్లలో బిజీగా ఉన్నారు. ప్రజలు అయోమయంలో ఉన్నారు అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు అడిగితే సీఎం రేవంత్ రెడ్డి బూతులు తిడుతున్నారు. హామీలు అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాగులో వంద తొండలు ఇడుస్తారు. ఓటు ద్వారా ప్రజలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం. తెలంగాణను రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు రేవంత్ రెడ్డిని వదలం.

యాదగిరి గుట్ట టెంపుల్ బయట మేము ఫోటో షూట్ చేశాము. ఈవో పర్మిషన్ తీసుకున్నాకే ఫోటో షూట్ తీశాము. కేసీఆర్ కట్టించిన యాదాద్రి టెంపుల్ ప్రపంచానికి తెలియాలని ఫోటో షూట్ చేశాము. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు సీట్లు ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పైసలు వయానాడ్ కు హెలికాఫ్టర్ లో తీసుకువెళ్లి ప్రియాంక గాంధీకి ఇచ్చి వస్తున్నారు. ఏ అధికారి ఓవర్ యాక్షన్ చేసినా వారి పేర్లు రాసుకుంటాము. తెలంగాణ కేసీఆర్ సీఎం కాక తప్పదు. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ లు సస్పెండ్ అయ్యారు అని కౌశిక్ రెడ్డి గుర్తు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news