39 మంది టీజీఎస్పీ కానిస్టేబుల్స్ సస్పెండ్.. వరంగల్, నల్గొండలో ఆందోళనలు!

-

బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఓకే పోలీస్ విధానం అమలు చేయాలని ఆందోళనకు దిగిన వారిలో 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లను రేవంత్ సర్కార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌పై వరంగల్ జిల్లా మామునూరు ఫోర్త్ బెటాలియన్లో ఆందోళనకు దిగారు తోటి కానిస్టేబుళ్లు. వారిపై
సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే విధులను బహిష్కరించారు.

అదేవిధంగా, నల్గొండ 12వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్స్ సైతం ఆందోళనకు దిగారు. శనివారం శాంతియుతంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుల్స్‌ను అకారణంగా సస్పెండ్ చేశారని, తక్షణమే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేసి పోలీసులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news