కులగణన బలహీన వర్గాల ఆకాంక్ష : మంత్రి పొన్నం ప్రభాకర్ 

-

కులగణన బలహీన వర్గాల ఆకాంక్ష అని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో తెలిపారు. 1931లో కులగణన చేశారు. 1931 నుంచి ఇప్పటివరకు కులగణన చేయలేదు. కాబట్టి ఈ కులగణన దేశ చరిత్రలోనే రికార్డు అని తెలిపారు. ఇప్పటి వరకు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ జోడో యాత్రలో కులగణన చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టాం. 

రాజకీయాలు, పార్టీలకతీతంగా ఈ కులగణన సర్వేను అభినందించాలని.. ఏమైనా సూచనలుంటే కూడా చేయాలని అసెంబ్లీలో కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. తప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బలహీన వర్గాలకు ఈరోజు శుభదినం అన్నారు.  బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రతి పక్ష నాయకులు పలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఎలాంటి బేషాజాలు లేకుండా కులగణన ద్వారా బలహీన వర్గాలకు న్యాయం జరగాలి.. దీంతో రోడ్డు మ్యాప్ రావాలి అని కోరుతున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news