కారులో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ బాలిక అని తేలితే ప్రైవేటు ఆసుపత్రిలో గుట్టుగా అబార్షన్ చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన కాత్యాయిని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేది. ఆమె పని చేసే ఆసుపత్రికి చారి, మనోజ్ అనే ఇద్దరు ఆర్ఎంపీలు రోగులను పంపేవారు.
దీంతో వీరి ముగ్గురికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్రమ సంపాదనకు ఆశ పడిన ఈ ముగ్గురు ఒక కారులో అల్ట్రాసౌండ్ స్కాన్ పరికరం ఏర్పాటు చేసుకొని పేద మహిళలను టార్గెట్ చేస్తూ కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు.
ఒక వేళ గర్భంలో ఉన్నది బాలిక అని తేలితే పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి పంపి అబార్షన్ చేయించి పైసలు వసూలు చేస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
కారులో లింగ నిర్ధారణ పరీక్షలు.. బాలిక అని తేలితే ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్
ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన కాత్యాయిని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేది, ఆమె పని చేసే ఆసుపత్రికి చారి, మనోజ్ అనే ఇద్దరు ఆర్ఎంపీలు రోగులను పంపేవారు దీంతో వీరి… pic.twitter.com/fCu5KihX2O
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2025