16 రోజుల ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ లో కీలక అప్డేట్ వచ్చేసింది. టీబీఎం మెషీన్ ముందు భాగంలో మృతదేహాం ఆనవాళ్లు కనుగొనింది రెస్క్యూ టీం. కుడి చెయ్యి, ఎడమ కాలు భాగాలను గుర్తించారు రెస్క్యూ టీం. చేతికి కడియం ఉండడంతో ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవాళ సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకి తీసే అవకాశం ఉంది. దీంతో కార్మికులు ఇదే చోట ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్లో జేసీబీని ఉపయోగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఇక అటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముక్కలు ముక్కలుగా టీబీఎం మిషన్ వస్తోంది. మిషన్ను కట్టర్తో కట్ చేశాయి రెస్క్యూ టీమ్స్. మిషన్ పార్ట్లను బయటకు పంపిస్తున్నారు సహాయకులు. ఈ ప్రక్రియ పూర్తియితే కార్మికుల ఆచూకీపై కొలిక్కి వచ్చే అవకాశం ఛాన్సు ఉంది.