గ్రూప్ -1లో అవకతవకలు.. ఒకే సెంటర్లో 30 మంది ఓసీ అభ్యర్థులు

-

గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు సైతం వెలువడిన విషయం తెలిసిందే. గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కగా.. సర్వోన్నత న్యాయస్థానం వాటిని తోసిపుచ్చినట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ ఫలితాల్లో ఒకే పరీక్షా కేంద్రం నుంచి 74 మంది సెలెక్ట్ అవ్వడం, అందులో 30 మంది ఓసీలు ఉండటంపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మల్లన్న ఆరోపించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై టీజీపీఎస్సీ, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news