నేటి నుంచి ప్రత్యేక బస్సులు

-

దసరా పండుగ సందర్భంగా  ప్రత్యేక బస్సులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ పది రోజులపాటు 4,480 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆర్‌ఎం యాదగిరి తెలిపారు.. ఎంజీబీఎస్‌, జేబీఎ్‌సతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌, కాచిగూడ, లింగంపల్లి, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఉప్పల్‌ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎంజీబీఎస్‌, జేబీఎ్‌సలో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్ల రిజర్వేషన్‌ చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news