బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.చెన్నమనేని రమేష్ ఇండియన్ సిటిజన్ కాదని, జర్మన్ పౌరుడు అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ అనంతరం రమేశ్ భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరుడు అని తేల్చింది.
తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు మండిపడింది.ఈ మేరకు చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. రూ.30 లక్షల జరిమానా సైతం విధించింది. పిటిషనర్ ఆది శ్రీనివాస్కు రూ.25 లక్షలు..హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా, తీర్పును గౌరవిస్తూ చెన్నమనేని రమేశ్ జరిమానా చెల్లించినట్లు సమాచారం.