ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాత్రి 10 గంటలకు వైజాగ్ కి వెళ్లనున్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించనున్నారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరారమర్శించనున్నారు చంద్రబాబు. పారిపోతున్నచంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి మరీ చంపేశారు. చంపొద్దని వేడుకున్నా.. ఉగ్రమూకలు వినకుండా చంద్రమౌళిని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
సమాచారం తెలుసుకున్న వెంటనే వైజాగ్ నుంచి కుటుంబ సభ్యుల పహల్గామ్ కి బయలుదేరి వెళ్లారు. చంద్రమౌళి మృతదేహం ఇవాళ రాత్రి విశాఖ కు చేరుకోనుంది. చంద్రమౌళి తోడల్లుడు కుమార్ రాజా మీడియాతో మాట్లాడారు. ఈనెల 18న ట్రావెల్ ఏజెంట్ ద్వారా కాశ్మీర్ టూర్ కి వెళ్లారు. విశాఖ నుంచి మొత్తం ఆరుగురు వెళ్లారు. అయితే 25 వరకు తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు స్నేహితులు అప్పన్న, శశిధర్ ఫ్యామిలీలు వెల్లాయి. చంద్రమౌలి తప్పించుకునే ప్రయత్నం చేశారు.. కానీ ముష్కరులు హతమార్చారు.