వేదికపై మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. గుండెతట్టే జోష్

-

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంగా సాగాయి, గ్రామాలన్నీ గులాబీ రంగు పులుముకున్నాయి. అయితే.. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అయితే.. ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మరోసారి తన మాస్ డ్యాన్స్‌తో అందరినీ ఆకర్షించారు. బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద మంత్రి మల్లారెడ్డి తన జోష్‌ లాంటి హావభావాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఇది ఒక రకమైన సందడి. సభ వేదికకు చేరుకున్న మల్లారెడ్డి, అక్కడ కేరింతలతో గాయ‌కుల పాటలకు స్టెప్పులేసి, దుమ్మురేపారు. ఆయనతో పాటు ఉన్న నేతలు కూడా డ్యాన్స్‌లో భాగస్వాములయ్యారు. ఈ దృశ్యాన్ని చూసిన కార్యకర్తలు “జై మల్లన్న”, “జై తెలంగాణ” అంటూ నినాదాలు చేశారు. మల్లారెడ్డి మాస్ డ్యాన్స్‌తో సభా వేదికలో ఉన్న జోష్ రెట్టింపయ్యింది. ఇకపోతే.. ఇప్పుడే సభ వేదిక వద్దకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news