గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం అత్తాపూర్ ఫ్లై ఓవర్ మీద కారు పల్టీ కొట్టింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్లే దారిలో పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీ కొనగా.. వేగం మీద ఉన్న ఓ కారు పల్టీ కొట్టి డివైడర్ మీద పడిపోయింది. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలు అవ్వడంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం సివిల్ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం కారును అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అత్తాపూర్ – పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై కారు బోల్తా
మెహదీపట్నం నుండి ఆరాంఘర్కు వెళ్తుండగా అతివేగంతో కారును ఢీకొట్టిన మరో కారు
ప్రమాదంలో కారు డ్రైవర్కు స్వల్ప గాయాలు pic.twitter.com/KTXVjUvPSh
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2025