భారత మాజీ ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన

-

భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద నరవాణే, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై స్పందిస్తూ బుధవారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. “సినిమా ఇంకా మిగిలి ఉంది” అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన కొద్ది గంటల తర్వాత ఈ వ్యాఖ్య రావడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ కింద భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను లక్ష్యంగా చేసుకుని పరిమిత స్థాయిలో వైమానిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో నరవాణే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన గతంలో 28వ ఆర్మీ చీఫ్‌గా సేవలందించిన విషయం తెలిసిందే.

ఇక పాకిస్థాన్ వైపున ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాక్ ప్రభుత్వం, భారత దౌత్యవేత్తను పిలిపించి నిరసన తెలిపింది. అలాగే, ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అనే పర్యవసాన గళాన్ని పాక్ అధికారులు వినిపిస్తున్నారు. పాక్ సమాచార మంత్రి అతుల్లా తరార్ మాట్లాడుతూ, భారత్ “యుద్ధాత్మక చర్య”కు పాల్పడిందని ఆరోపించారు. పాక్ భద్రతా వర్గాలు ఇప్పటికే సైనిక స్థాయిలో స్పందనకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్–పాక్ మధ్య ఉద్రిక్తత మరింత పెరగనుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news