KCRకు షాక్… ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్దం

-

ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్దం అయింది. కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించనుంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నాయ్. గ్రేటర్ హైదరాబాద్ లో 15 వేల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమైనట్లు గుర్తించింది సర్కార్. భూముల విలువ రూ. లక్ష కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేశారు.

Forensic audit on Dharani irregularities ready
Forensic audit on Dharani irregularities ready

అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూముల రికార్డుల్లో గందరగోళం నెలకొంది. 2014 నుంచి 2023 మధ్య భూలావాదేవిలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నారు. రికార్డుల తారుమారుతో లక్షల ఎకరాల సమాచారం మిస్సింగ్ అయింది. అటవీ శాఖ రికార్డుల ప్రకారం 22.74 లక్షల ఎకరాల సమాచారం మాయం అయ్యింది. తారుమారైన భూములపై చర్యలకు సిద్దం అయ్యింది. ధరణిపై ఆడిట్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేసారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news