వడగళ్ల వర్షం.. ధ్వంసమైన విమానం ముందు భాగం

-

వడగళ్ల వర్షం దెబ్బకు ..విమానం ముందు భాగం ధ్వంసమైంది . ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. వడగళ్ల వర్షం వల్ల విమానం ముందు భాగం దెబ్బతినడంతో భయాందోళనతో కేకలు వేశారు ప్రయాణికులు.

An IndiGo flight encountered severe hailstorm turbulence while approaching Srinagar
An IndiGo flight encountered severe hailstorm turbulence while approaching Srinagar

అయితే, సాయంత్రం 6:30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది విమానం. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 227 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం గానే ఉన్నారు.

అటు ఢిల్లీలో భారీ వర్షం కారణంగా మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు కూలిపోయి వీధులన్నీ జలమయం అయ్యాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ-ఘజియాబాద్, ఢిల్లీ-గురుగ్రామ్ వంటి కీలక రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news