నేటితో ముగియనున్న సరస్వతీ నది పుష్కరాలు..

-

Saraswati River Pushkaram to end today: సరస్వతీ నది పుష్కరాల వెళ్లేవారికి అలెర్ట్. సరస్వతీ నది పుష్కరాలు.నేటితో ముగియనున్నాయి. . ఇవాళ రాత్రి 7:45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలకు ముగిస్తారు. పుష్కరాల ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

Saraswati River Pushkaram to end today
Saraswati River Pushkaram to end today

సా. 6 గంటల నుండి వేద స్వస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. రాత్రి 7:46 నుండి 7:54 వరకు డ్రోన్ షో ఉంటుంది. సరస్వతీ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు మంత్రి సీతక్క. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాటాడారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వర క్షేత్రంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రకటించారు మంత్రి సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news